News February 15, 2025

ఖమ్మం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి: కవిత

image

ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు, కానీ అభివృద్ధిలో శూన్యమని, వారు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడుతూ.. బనకచర్ల పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా నష్టపోతారన్నారు. కళ్ల ముందు నీళ్లు వెళ్తున్నా.. ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల చాలా సీనియర్, ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ఆయనకు తెలుసని పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి మార్కెట్‌కు శుక్రవారం 45,000 బస్తాల మిర్చి వచ్చింది. తేజా రకం ధరలు ₹13,000 నుంచి ₹15,200 వరకు పలికాయి. అసాధారణ నాణ్యత గల డీలక్స్ రకాలు ₹15,700 వరకు అమ్ముడయ్యాయి. 341 రకం అత్యధికంగా ₹16,500 ధరను తాకింది. DD, NO-5 రకాలు కూడా డీలక్స్‌లో ₹16,000 వరకు పలికాయి. ఆర్మూర్ వంటి రకాలు ₹11,000 కనిష్టంగా నమోదయ్యాయి. పసుపు మిర్చికి నాణ్యత కొరవడింది. తేజా ఫాట్కీ ₹8,200 నుంచి ₹10,000 మధ్య పలికింది.

News October 31, 2025

యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

image

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.

News October 31, 2025

నరసరావుపేట కలెక్టరేట్‌లో సర్దార్ పటేల్ జయంతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ కృత్తికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.