News April 3, 2024
ఖమ్మం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎస్ఐ సాయికుమార్ కథనం ప్రకారం ముస్తఫానగర్కు చెందిన యల్లబోయిన ఉపేందర్(33) భార్య నీలిమతో గొడవపడగా ఆమె సోమవారం రాత్రి సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఉపేందర్ పురుగుల మందు తాగాడు. మంగళవారం నీలిమ ఇంటికి రాగా, ఉపేందర్ అపస్మారక స్థితిలో ఉండడంతో ఇంటిపక్కవారిని పిలిచి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
అత్యవసరమైతే 1077కు కాల్ చేయండి: ఖమ్మం కలెక్టర్

‘మొంథా’ తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వరదలు, ప్రమాదాల సమయంలో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 90632 11298కు కాల్ చేయవచ్చని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News October 29, 2025
ఖమ్మంలో పట్టు సడలుతున్న BRS..?!

ఖమ్మం జిల్లాలో BRS పట్టు సడలుతోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం పార్టీని కలవరపెడుతోంది. కమ్మ సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేసినప్పటికీ, ఆ వర్గం ఓటర్లు BRSను ఆదరించలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు సైతం పార్టీకి బలం చేకూర్చలేకపోతున్నారనే ప్రచారం ఉంది. BCలకు అవకాశాలు కల్పిస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందనే టాక్ వినిపిస్తోంది.
News October 29, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఖమ్మం సీపీ

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.


