News February 25, 2025
ఖమ్మం: మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.
Similar News
News October 28, 2025
తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.
News October 28, 2025
రాయపట్నంలో సబ్స్టేషన్కు Dy.CM భట్టి శంకుస్థాపన

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.
News October 28, 2025
డిప్లొమా దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ శంకర్

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయన్నారు. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tspmb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


