News February 25, 2025
ఖమ్మం: మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.
Similar News
News December 10, 2025
మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.
News December 10, 2025
‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.
News December 10, 2025
‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.


