News February 21, 2025
ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 19, 2025
భూపాలపల్లి: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్వో

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని డీఎంహెచ్వో డా.మధుసూదన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వైద్యులు పాల్గొన్నారు.
News March 19, 2025
ఫ్యామిలీ రూల్ పాలసీ మారదు: BCCI సెక్రటరీ

విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్పై <<15777927>>కోహ్లీ<<>> వ్యాఖ్యలకు BCCI సెక్రటరీ సైకియా కౌంటర్ ఇచ్చారు. ఈ రూల్స్ను సమీప భవిష్యత్తులో మార్చబోమన్నారు. ‘దీనిపై కొందరికి ఆగ్రహం, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాత్రికి రాత్రే ఈ విధానం తేలేదు. పాత నిబంధనలకే సవరణ చేశాం. ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్ల హాజరు, మ్యాచ్ షెడ్యూల్లు, పర్యటనలు తదితర నిబంధనలున్నాయి. ఇవి జట్టు సమన్వయం, ఐక్యత కోసం తీసుకున్న నిర్ణయాలు’ అని తెలిపారు.
News March 19, 2025
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబించింది: మంత్రి సురేఖ

రాష్ట్ర బడ్జెట్ మీద మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర రెండో బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి తగిన మేరకు కేటాయింపులు చేయడం హర్షణీయం అని మంత్రి అన్నారు.