News February 25, 2025

ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

image

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

Similar News

News January 8, 2026

రాయ‘చోటిస్తారా’?

image

రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేయడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం పెండిగ్లో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగల్లు ప్రాజెక్ట్‌లో పెండింగ్ పనుల పూర్తి, చిన్నమండెంలో నిర్మితమై ఉన్న రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు చేరేలా చర్యలు తీసుకోవాలి. గువ్వలచెరువు ఘాట్ టన్నెల్, మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుతం రియలెస్టేట్ దెబ్బతింటోంది కాబట్టి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆశిస్తున్నారు.

News January 8, 2026

మున్సిపల్ ఎన్నికలకు BRS స్పెషల్ మ్యానిఫెస్టో

image

TG: ‘సర్పంచ్’ ఫలితాల జోష్‌తో మున్సిపల్ ఎన్నికలకు BRS సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీల్లో రాజకీయ ఎజెండాను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించాలని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ జారీ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోను ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.

News January 8, 2026

మరోసారి పడిపోయిన మీషో షేర్లు.. కారణమిదే!

image

జనరల్ మేనేజర్ మేఘా అగర్వాల్ రాజీనామాతో మీషో షేర్ల విలువ మరోసారి భారీగా పతనమైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే షేర్ వాల్యూ రూ.165కు చేరుకుంది. వరుసగా మూడో సెషన్‌లో కూడా కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. DECలో రూ.254.40 వద్ద ఆల్‌టైమ్ హైకి చేరిన షేర్లు బుధవారం మరో 5% పతనమయ్యాయి. తాజాగా లిస్టింగ్‌కు వచ్చిన మీషో షేర్ వాల్యూ ఇప్పటివరకు 35% పడిపోవడంతో రూ.40వేల కోట్ల సంపద ఆవిరైంది.