News February 25, 2025

ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

image

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

Similar News

News January 8, 2026

TODAY HEADLINES

image

☛ 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: CM CBN
☛ అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
☛ ఏపీలో ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ రూ.1000
☛ TGలో మున్సిపల్ ఎన్నికలు.. ఈనెల 16న ఓటర్ల తుది జాబితా విడుదల
☛ TGలో సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు
☛ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
☛ T20 WC: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచులు!

News January 8, 2026

Official: ‘జన నాయగన్‌’ విడుదల వాయిదా

image

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.