News October 12, 2024

ఖమ్మం: ముగ్గురిపై కేసు నమోదు: సీఐ

image

మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. జిల్లా ఆస్పత్రి MCHలో ఓ మహిళా ఉద్యోగికి సహోద్యోగి సురేశ్ మద్యం తాగి ఫోన్ చేశాడు. ఆస్పత్రిలో సిబ్బంది శ్రీకాంత్, సత్యకుమార్‌కు ఆమెతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారని, తనతోనూ ఏకాంతంగా గడపాలంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.

Similar News

News October 12, 2024

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నామని పేర్కొన్నారు. మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీని చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.

News October 12, 2024

కొత్తగూడెం: దసరా పండుగ వెలుగులు నింపాలి: కలెక్టర్

image

దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరూ, వాడా, చిన్నా,పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేశారని అన్నారు.

News October 12, 2024

మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం

image

విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.