News February 16, 2025
ఖమ్మం మోడ్రన్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతం

ఖమ్మం రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25 కోట్లతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు. ప్లాట్ ఫాం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Similar News
News October 24, 2025
గద్వాల: బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ఈ బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు మృతి చెందగా, పది మంది గాయాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
News October 24, 2025
న్యూస్ రౌండప్

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా
News October 24, 2025
వడ్డేపల్లి మండలంలో 27.3 మిల్లీమీటర్ల వర్షం

గద్వాల జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అధికంగా వడ్డేపల్లిలో 27.3 మిల్లీమీటర్లు, తక్కువగా ధరూర్లో 5.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేటీదొడ్డి 18.4, గద్వాల 12.3, ఇటిక్యాల 10.8, మల్దకల్ 12.3, గట్టు 7.0, అయిజ 9.0, రాజోలి 23.5, మానవపాడు 9.0, ఉండవెల్లి 14.3, అలంపూర్ 23.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


