News February 16, 2025

ఖమ్మం మోడ్రన్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతం

image

ఖమ్మం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25 కోట్లతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు. ప్లాట్ ఫాం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Similar News

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.

News December 6, 2025

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు‌

image

హైదరాబాద్‌లోని<> ECIL <<>>15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్-C, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ , సీఎంఏ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/

News December 6, 2025

నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

image

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్‌కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్‌కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.