News February 16, 2025
ఖమ్మం మోడ్రన్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతం

ఖమ్మం రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25 కోట్లతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు. ప్లాట్ ఫాం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Similar News
News December 5, 2025
విశాఖలో పర్యాటకులకు గుడ్ న్యూస్

విశాఖలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు VMRDA ప్రణాళిక రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కార్డుతో నగరంలో 9 ప్రదేశాలను సందర్శించోచ్చు. ఒక రోజు టికెట్ (రూ.250- 300), నెల రోజులకు సిల్వర్ కార్డ్.. ఏడాది వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్యాకేజీలో కైలాసగిరి, తొట్లకొండ, TU-142, INS కురుసురా, సీ-హారియర్, UH-3H హెలికాప్టర్, తెలుగు మ్యూజియం, సెంట్రల్ పార్క్, VMRDA పార్క్ ఉన్నాయి. అమలులోకి 3 నెలలు సమయం పట్టనుంది.
News December 5, 2025
కొవ్వూరు ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

రానున్న పుష్కరాల నాటికి కొవ్వూరును సంపూర్ణంగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబుని కోరారు. గురువారం ఆయన సీఎంను కలిసి మొత్తం రూ.286.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో రోడ్లు, ఆలయ పునర్నిర్మాణం, స్నాన ఘాట్లు, నివాస సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
News December 5, 2025
సంగారెడ్డి: 10, 11 తేదీల్లో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు

సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, కొండాపూర్, హత్నూర, గుమ్మడిదల, కంది, పటాన్చెరు, సదాశివపేట మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు.


