News February 2, 2025

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు: సీఐ రమేశ్

image

ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ తెలిపారు. ప్రకాష్ నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె చదువుతున్న పాఠశాలకు సైతం వెళ్లి బెదిరిస్తుండటంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News November 14, 2025

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

image

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్‌లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’

News November 14, 2025

ఖమ్మం: మా పిల్లలు మంచిగా చదువుతున్నారా..?

image

ఖమ్మం జిల్లాలోని నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1,217ప్రభుత్వ పాఠశాలలు,14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశాలకు హజరయ్యే పేరెంట్స్‌కి స్కూల్లో బోధన, విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి, వారిని ఎలా ప్రోత్సాహించాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంశాల వారీగా 40నిమిషాల పాటు సమావేశం నిర్వహించనున్నారు.

News November 13, 2025

తల్లి కష్టం చూసి.. గ్రూప్-1 ఉద్యోగం సాధించి..

image

ఖమ్మం: చిన్న తనం నుంచే తల్లి కండక్టర్‌గా పడుతున్న కష్టాన్ని చూసి, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన ధర్మపురి జగదీష్.. ఖమ్మం నూతన ఆర్టీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి గ్రూప్-1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకం.