News April 13, 2025
ఖమ్మం: రామయ్యా.. చెట్లు ఏడుస్తున్నాయ్.!

‘నీ మరణ వార్త విని నువ్వు నాటిన చెట్టన్నీ నిన్ను చూడటానికి వద్దామనే అనుకున్నాయంట రామయ్య.. కానీ, ఎంతమంది ఊపిరి వదులుతారోనని ఆగిపోతున్నాయంతే’ అని వనజీవి రామయ్య మృతిపై చెట్లు బాధపడుతున్నాయంటూ వర్ణణ SMలో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ హితమే ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని, ప్రకృతికి జీవం పోసి మరణించాడని పుడమి కన్నీటి పర్యంతమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
VKB: జిల్లాలో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

తాండూర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో కరన్ కోట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్, లక్ష్మీనారాయణపూర్, గంగసాగర్, దేవులతాండ, కిష్టాపూర్, రుద్రారం, బుగ్గాపూర్ పలు గ్రామాలు ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు ఈ నెలాఖరు వరకు అధికారికంగా ప్రకటించనున్నారు.
News December 4, 2025
పుతిన్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజభవనం గురించి తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రాజ భవనాన్ని కట్టించారు. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించేందుకు 2L పౌండ్లు(ఇప్పటి లెక్కల్లో ₹170 కోట్లు) ఖర్చు చేశారు. 8.6 ఎకరాల ప్యాలెస్లో 36 గదులు, మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు వంటివెన్నో ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు.
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.


