News April 13, 2025

ఖమ్మం: రామయ్యా.. చెట్లు ఏడుస్తున్నాయ్.!

image

‘నీ మరణ వార్త విని నువ్వు నాటిన చెట్టన్నీ నిన్ను చూడటానికి వద్దామనే అనుకున్నాయంట రామయ్య.. కానీ, ఎంతమంది ఊపిరి వదులుతారోనని ఆగిపోతున్నాయంతే’ అని వనజీవి రామయ్య మృతిపై చెట్లు బాధపడుతున్నాయంటూ వర్ణణ SMలో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ హితమే ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని, ప్రకృతికి జీవం పోసి మరణించాడని పుడమి కన్నీటి పర్యంతమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 21, 2025

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్

image

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్‌ ఎంటర్ అయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.

News November 21, 2025

NRPT: స్థానిక ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినీత్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.