News June 20, 2024
ఖమ్మం: రాష్ట్రానికి సింగరేణి జీవగడ్డ లాంటిది- తుమ్మల

రాష్ట్రానికి సింగరేణి జీవగడ్డ లాంటిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వేలం పేరుతో బొగ్గు గనులను ప్రవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని అన్నారు. బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని గనులన్నీ సింగరేణికే అప్పజెప్పాలన్నారు.
Similar News
News November 23, 2025
ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.
News November 23, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
News November 23, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.


