News March 22, 2025

ఖమ్మం: ‘రాష్ట్ర అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు విజయ లక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15లోగా అర్హులు దరఖాస్తుపత్రాలను సహాయ సంచాలకులు, చేనేత, జౌళి శాఖ, హన్మకొండ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మే 30లోపు దరఖాస్తుదారుడి ఉత్పత్తిని మగ్గంపై తనిఖీ చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News November 18, 2025

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 18, 2025

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 18, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.8, న్యాల్‌కల్ 8.2, సదాశివపేట 8.4,మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 9.9, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6,పోతారెడ్డిపేట 9.2, కొండపాక 9.7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు,బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.