News December 12, 2024
ఖమ్మం: రేపు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ: కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏసీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ బహిరంగ విచారణ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. విచారణ కమీషన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సంఘ నాయకులు అధిక సంఖ్యలో హాజరై వారి వినతులను అందజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 15, 2025
KMM: పండుగపూట.. యువకుడి కిడ్నాప్ కలకలం!
పండగపూట యువకుడు కిడ్నాప్నకు గురైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన సంజయ్ కుమార్ సోమవారం రాత్రి తన అన్నను తీసుకురావడానికి బస్టాండ్కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అన్న సాయికి సంజయ్ కుమార్ ఫోన్ చేశాడు. కొద్ది సేపటికే సంజయ్ ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
News January 14, 2025
కూసుమంచి: రైతులు విన్నవించారు.. మంత్రి స్పందించారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూసుమంచి మండలం చౌటపల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన పైపులు దెబ్బతినడంతో నీటి సరఫరా ఆగిపోయింది. ఈసందర్భంగా రైతులు స్థానిక నాయకుల ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించారు. నేడు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
News January 14, 2025
ఖమ్మం శివారులో మహిళ సూసైడ్
చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.