News April 16, 2025
ఖమ్మం: రేపు మహిళలకు జాబ్ మేళా..!

ఖమ్మం గాంధీ చౌక్లోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నందు ఈనెల 17న ఉదయం 10 గంటలకు మహిళలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 30-45 సంవత్సరాల వయస్సు కలిగి, డిగ్రీ పాసైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 20, 2025
KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.
News April 20, 2025
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News April 20, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు