News January 28, 2025

ఖమ్మం: రైతుల ఖాతాల్లో రూ.28.42 కోట్ల జమ 

image

ఖమ్మం జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలోని ఎంపిక చేసిన 21 రెవెన్యూ గ్రామాల్లో 20,802 మందికి రూ.28.42కోట్లను జమ చేసినట్లు అధికారులు తెలిపారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి 5,490 మంది రైతులకు చెందిన 6,419 ఎకరాల భూమిని రైతు భరోసా పోర్టల్ నుంచి రిమూవ్ చేసింది. మిగతా రైతులకు విడతలవారీగా పథకం అందనుంది.

Similar News

News March 1, 2026

ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

image

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News March 1, 2026

ఖమ్మం: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు..

image

ఖమ్మం జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్తకార్డులతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతున్నారు.

News March 1, 2026

రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

image

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.