News March 22, 2024

ఖమ్మం: రైలు నుంచి పడి యువకుడు మృతి

image

ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడి వయసు సుమారు 21 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పోలీసులు తెలిపారు.

Similar News

News September 17, 2025

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

image

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

image

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.

News September 17, 2025

ఖమ్మం: నిజాంకు వ్యతిరేకంగా తనికెళ్ల వీరుల పోరాటం

image

నిజాం పాలనకు వ్యతిరేకంగా తనికెళ్ల గ్రామ ప్రజలు సాగించిన పోరాటం అత్యంత కీలకమని నిజాం వ్యతిరేక పోరాట యోధులు గుర్తుచేశారు. కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీతో పాటు తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, రామకృష్ణయ్య, ముత్తయ్య, యాస వెంకట లాలయ్య, మల్లెల వెంకటేశ్వరరావు దళంలో చేరి పోరాడారు. ఈ క్రమంలో రజాకారుల నుంచి సీతారామయ్యను గ్రామస్థులు తెలివిగా తప్పించిన వైనం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.