News March 29, 2024

ఖమ్మం: రైల్వే లైన్.. రైతుల్లో ఆందోళన 

image

ఖమ్మం జిల్లా మీదుగా డోర్నకల్‌-మిర్యాలగూడ, డోర్నకల్‌-గద్వాల లైన్ల నిర్మా ణం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. లైన్ల ప్రతిపాదనలపై ఏ శాఖ అధికారులూ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకోడు గుట్ట, తిరుమలాయపాలెం రైతు వేదిక, పాపాయిగూడెం సమీపాన మార్కింగ్‌ ఇచ్చారు. దీంతో రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News January 14, 2025

ఖమ్మం శివారులో మహిళ సూసైడ్ 

image

చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News January 14, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News January 14, 2025

ఖమ్మం: మంత్రి తుమ్మల పట్టుబట్టి మరి సాధించారు: ఉత్తమ్

image

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల పట్టు బట్టి మరి సాధించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి కానుకగా రఘునాథపాలెం ప్రజలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇవ్వాలని తుమ్మల పట్టుబట్టారన్నారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టు నిర్మించినా సాగులోకి మాత్రం తీసుకు రాలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించి ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందించలేదన్నారు.