News March 29, 2024
ఖమ్మం: రోజూ రూ.1.50 కోట్లకు పైనే..

ఖమ్మం హెడ్ పోస్టాఫీస్లో నిత్యం రూ.1.50 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పొదుపు పథకాలు, డిపాజిట్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, తపాలా జీవిత బీమా, మనియార్డర్లు , స్పీడ్ పోస్టులు, పార్సిళ్ల సేవలతో పాటు పాస్పోర్టు సేవలు, ఆధార్ సేవలు, స్టాంపుల విక్రయాలు వంటి వాటి ద్వారా ఈ లావాదేవీలు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Similar News
News January 3, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
ఖమ్మం: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు

ఖమ్మం నగరంలో టెట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని తెలిపారు. ఉ.9 నుంచి 11 వరకు ఒక సెషన్, మ.2 నుంచి సా.4:30 వరకు మరో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కాగా పరీక్షలకు మొత్తం 20,547 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
News January 3, 2026
ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

☆ ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
☆ సత్తుపల్లి (మం) రామానగరంలో నేడు రక్తదాన శిబిరం
☆ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ పక్రియ
☆ జిల్లాలో పర్యటించనున్న కలెక్టర్ అనుదీప్
☆ ఖమ్మంలో నేటి నుంచి టెట్ పరీక్షలు
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన


