News June 28, 2024
ఖమ్మం: రోడ్డు పక్కన శిశువు మృతదేహం

పసి గుడ్డును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన కూసుమంచి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్గూడెం నుంచి కోదాడ వెళ్లే 5 నెలల శిశువును రోడ్డు పక్కన ఉంది. మాదిగ కుంట వైపు వెళ్తున్న సతీశ్ అనే వ్యక్తికి శిశువు కనిపించింది. జీపీ సెక్రటరీకి తులసిరాంకీ సమాచారం అందించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారు కూసుమంచి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
Similar News
News December 13, 2025
ఖమ్మం: భార్యాభర్తలే సర్పంచ్, ఉప సర్పంచ్

బోనకల్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్గా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మంగమ్మపై 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళా కావడంతో సతీమణిని బరిలో నిలిపి, సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సీపీఎం తరఫున జడ్పీటీసీగా గెలిచారు.
News December 13, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} రెండో విడత పోలింగ్కు అధికారులు ఏర్పాటు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News December 13, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 6మండలాల్లో పరిధిలో ఉన్న 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. ఓ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామపంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారన్నారు. మిగిలిన 160 GPలకు మొత్తం 451మంది, 1,379వార్డులకు 3,352మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు.


