News March 29, 2024

ఖమ్మం విషయంలో ఎందుకింత లేటు..

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉండగా, బీజేపీ తాండ్ర వినోద్ రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో ఇంకా మల్లగులాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయంపై స్పష్టత రాలేదు. కంచుకోటలోనూ టికెట్ కేటాయింపులో జాప్యం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

Similar News

News January 25, 2025

గ్రామసభలు గొడవలు లేకుండా జరిగాయా?: తాతా మధు

image

ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో  తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.

News January 25, 2025

KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్

image

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 24, 2025

KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ

image

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్‌లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.