News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 18, 2025
కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్లోకి కడియం!

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.
News November 18, 2025
కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్లోకి కడియం!

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.
News November 18, 2025
వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.


