News March 13, 2025

ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

image

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 11, 2026

హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

image

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.

News February 11, 2026

గద్వాల: మున్సిపాలిటీల వారిగా పోలింగ్ ఇలా..!

image

గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 78.22% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అయిజ మున్సిపాలిటీ అత్యధిక పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, గద్వాల మున్సిపాలిటీలో పోలింగ్ కాస్త తక్కువగా నమోదైంది.
అయిజ 84.69% (అత్యధికం)
అలంపూర్ 81.18%
గద్వాల 74.57%
వడ్డేపల్లి 84.26%*

News February 11, 2026

NRPT: మద్దూరులో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

image

నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 72.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాల్టీల వారిగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
నారాయణపేటలో 74.18 శాతం, కోస్గి 74.83%, మక్తల్ 65.83%, మద్దూరు 79.0 శాతం పోలింగ్ నమోదైంది. మద్దూరు మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా 79.0 శాతం పోలింగ్ నమోదైంది.