News March 1, 2025
ఖమ్మం: వేసవి జాగ్రత్తల పట్ల ప్రజలకు వైద్య శాఖ సూచనలు

ఖమ్మం: సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ సూచించారు. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ, అలసట, వికారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకుండా గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని తెలిపారు.
Similar News
News January 7, 2026
నేడు ఖమ్మానికి కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2026
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} నేలకొండపల్లిలో రోడ్డు భద్రత మాసోత్సవాల
∆} మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News January 7, 2026
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం: కలెక్టర్

ఖమ్మం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పన్నుల వసూలు, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనలో బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు.


