News June 11, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.6,950 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News March 24, 2025
మిస్ తెలుగు USA ఫైనలిస్ట్లో ఖమ్మం జిల్లా యువతి

మిస్ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్ మం. ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే25న డల్లాస్లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముష్టికుంట్లకు చెందిన శివనర్సింహారావు-మాధవి దంపతుల కుమార్తె గీతిక.
News March 24, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓:వైరా ప్రాజెక్టును పర్యాటకంగా గుర్తించాలి: ఎమ్మెల్యే✓: చింతకాని:బావిలో పడి మహిళా కూలీ మృతి✓:సత్తుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద బైక్-ట్యాంకర్ ఢీ✓:’ఏన్కూర్: బస్టాండ్ లేక అవస్థలు పడుతున్నాం✓:నేలకొండపల్లి మండలంలో యువకుల కొట్లాట✓:కల్లూరు: క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:SI✓:ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు: కలెక్టర్
News March 23, 2025
ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు

జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని, ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమనే ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవల దివ్యాంగులకు కలెక్టరేట్లో ఉచిత భోజనం వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ను అభినందిస్తున్నారు.