News August 23, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త నమూనా

ప్రధాన మార్కెట్లో ఒకటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్. 1954లో 15.28 ఎకరాల్లో ఈ మార్కెట్ను ప్రారంభించారు. పెరిగిన క్రయవిక్రయాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో, విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్గా త్వరలోనే నిర్మాణం చేపట్టనుండగా మార్కెట్ నమూనా బయటకొచ్చింది. రూ.148 కోట్ల అంచనాతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో.. 168 జీపీలకు నేడే పోలింగ్

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 191 గ్రామ GPలకు గానూ 22 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 జీపీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఏన్కూరు(21), కల్లూరు(23), పెనుబల్లి(32), సత్తుపల్లి(21), తల్లాడ (27), వేంసూరు (26), సింగరేణి(41) మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు.
* GP ఎలక్షన్ల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 16, 2025
ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.
News December 16, 2025
మూడో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు, కౌంటింగ్ 2 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


