News October 12, 2024

ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

image

విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.

Similar News

News November 23, 2025

ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

image

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్‌కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.

News November 23, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్‌మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

News November 23, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్‌మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.