News November 8, 2024

ఖమ్మం: సమగ్ర సర్వేపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సర్వే నిర్వహణకు నిర్దేశించిన ఫార్మాట్లో ఫారాలు సిద్ధమయ్యాయా, సిబ్బందికి అవసరమైన పరికరాలు, స్టేషనరీ ఐటెమ్స్ పంపిణీ మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 28, 2025

పాలేరు జలాశయంలో భారీ చేప

image

కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన జాలరి మేకల పరశురాములుకు పాలేరు జలాశయంలో భారీ చేప లభించింది. వేటకు వెళ్లగా ఆయన వలలో 19 కేజీల మీసాలజెల్ల చేప చిక్కింది. దీని ధర కేజీ రూ.200 ఉంటుందని పరశురాములు వెల్లడించాడు. ఇలా మీసాలతో ఉండే చేపలు జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయన్నాడు.

News October 28, 2025

NOV 1 నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నవంబర్ 1నాటికి 100% కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి 2,98,773,34 ఎకరాలు, పత్తి 2,51,980, 1,816,12 ఎకరాల్లో మొక్కజోన్న సాగు చేశారు. ప్రస్తుతం ఈ మూడు పంటలను కోస్తున్న రైతులు కల్లాలో పంటను ఆరబోస్తున్నారు. తుపాను ప్రభావం జిల్లాపై ఉంటుందని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి నల్లబడుతుందని దిగాలుగా ఉన్నారు.

News October 28, 2025

ఖమ్మం: కార్తీకమాసం.. అరుణాచలంకు ప్రత్యేక బస్సు

image

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం సరీరాం తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7గంటలకు బస్సు బయలుదేరి 4వ తేదీ కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2530గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965లను సంప్రదించవచ్చని కోరారు.