News February 18, 2025

ఖమ్మం – సూర్యాపేట హైవే పై రోడ్డు ప్రమాదం

image

కూసుమంచి మండలంలో  ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్‌‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News March 20, 2025

ఖమ్మం: జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్: అ.కలెక్టర్

image

ఖమ్మంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని మీ సేవ ద్వారా జర్నలిస్టులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. అప్లై తరువాత రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 20, 2025

టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.

News March 20, 2025

ఖమ్మంలో ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. ఇవాళ జరిగిన పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ తెలిపారు. అటు జిల్లా వ్యాప్తంగా జనరల్ కోర్సుల్లో 16,446 మందికి గాను 15,939, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 1,719 మందికి గాను 1,576 మంది హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు సంబంధించి 650 మంది గైర్హాజరు హాజరైనట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!