News November 12, 2024

ఖమ్మం: సొంత నివాసాలు లేని మంత్రులు

image

రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.

Similar News

News December 10, 2025

టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

image

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.

News December 10, 2025

మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

image

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.