News February 9, 2025

ఖమ్మం: స్థానిక సమరానికి రె‘ఢీ’

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. ఇటీవలే మండల కేంద్రాల్లో జాబితాను రూపొందించి, ప్రదర్శించారు. జిల్లాలో 8,52,879 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News December 21, 2025

అడవి మంటలపై అప్రమత్తంగా ఉండాలి: అటవీ శాఖ

image

ఖమ్మం జిల్లాలో అడవి మంటల నివారణకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అటవీ శాఖ కోరింది. అటవీ ప్రాంతాల్లో సిగరెట్లు తాగడం, వంటల కోసం నిప్పు రాజేయడం వంటి పనులు చేయరాదని హెచ్చరించింది. “అడవిని రక్షిస్తేనే – భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొంటూ, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు కనిపిస్తే వెంటనే 87422 95323 లేదా టోల్ ఫ్రీ 18001 19334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది.

News December 21, 2025

రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి: ఖమ్మం కలెక్టర్

image

ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేపట్టే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా సోమవారం(DEC 22) నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ అర్జీలను కలెక్టరేట్లో సమర్పించి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 21, 2025

రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి: ఖమ్మం కలెక్టర్

image

ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేపట్టే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా సోమవారం(DEC 22) నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ అర్జీలను కలెక్టరేట్లో సమర్పించి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.