News March 13, 2025

ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.

Similar News

News December 13, 2025

వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

image

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 13, 2025

NRPT: రెండో విడత పోలింగ్‌కు సిద్ధం

image

నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల పరిధిలో రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం రోజు 95 గ్రామ పంచాయతీలకు, 900 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News December 13, 2025

మన్యం: జిల్లాలో 2,169 మంది అంగన్వాడీలకు ఫోన్లు అందజేత

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం 2,169 మొబైల్ ఫోన్లను సిబ్బందికి కేటాయించినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. శనివారం వన్ స్టాప్ కేంద్రం ఆవరణలో పంపిణీ చేపట్టారు. జిల్లాలోని మొత్తం 2,075 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున ఫోన్లు కేటాయించారు. వీరితో పాటు పర్యవేక్షణాధికారులైన 84 మంది సెక్టర్ సూపర్‌వైజర్లకు, పరిపాలనా సిబ్బందికి పంపిణీ చేశామన్నారు.