News March 13, 2025

ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.

Similar News

News November 25, 2025

యాదాద్రీశుడి హుండీలో 20 దేశాల కరెన్సీ

image

యాదాద్రి శ్రీవారి దేవస్థానం హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. 20 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO వెంకట్రావు తెలిపారు. అమెరికా 2,014, ఆస్ట్రేలియా 75, ఇంగ్లండ్ 65, సౌదీ అరేబియా 61, ఒమన్ 2, మలేషియా 51, యూరో 15, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 970, కెనడా 1245, న్యూజిలాండ్ 95, శ్రీలంక 500, బహ్రెయిన్ 2, అరబ్ ఎమిరేట్స్ 70, సింగపూర్ 41, ఖతార్ 318, చైనా 20 తదితర దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.

News November 25, 2025

ఆలయ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కి రప్పించాలి: CCIకి అధికారుల విజ్ఞప్తి

image

<<18381330>>రాజన్న ఆలయ ట్రస్టు ఖాతాలో<<>> జమ అయిన ఏదుల సత్తమ్మకు చెందిన రూ.2,14,549లను వెనక్కి తెప్పించి రైతుకు అందజేయాలని సీసీఐ అధికారులకు వేములవాడ మార్కెట్ కమిటీ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. సత్తమ్మ ఆధార్ కార్డుకు రాజన్న ఆలయ బ్యాంకు అకౌంటు లింక్ అయి ఉండడంతో ఆమె పత్తి విక్రయించిన సొమ్ము ఆలయ ఖాతాలో జమ అయింది. కాగా, ప్రైవేటు వ్యక్తి ఆధార్ నంబర్‌తో రాజన్న ఆలయ అకౌంటు లింక్ అయి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

News November 25, 2025

మదనపల్లె జిల్లా ఇలా ఉంటుంది..!

image

మదనపల్లె కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిన్న సీఎం మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో 27వ జిల్లాగా మదనపల్లెను ప్రకటించనున్నారు. పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఉంటుంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.