News March 13, 2025
ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.
Similar News
News December 7, 2025
తిరుపతి: మరో ప్రొఫెసర్ది అదే డిపార్ట్మెంట్.!

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.
News December 7, 2025
తిరుపతి: వర్సిటీ ICC ఏమి చేసింది.!

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై వేధింపుల కేసులో INTERNAL COMPLAINT COMMITY (ICC) ఇద్దరు ప్రొఫెసర్లను విచారించినట్లు చర్చ నడుస్తుంది. ఈ కమిటీలోని నలుగురు సభ్యులు అసిస్టెంట్ ప్రొ.లక్ష్మణ్ కుమార్ను ప్రశ్నించగా ‘యువతిని తీసుకురాండి.. నాపై అనవసరంగా ఫిర్యాదు చేసింది’ అని చెప్పినట్లు సమాచారం.
News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.


