News February 20, 2025

ఖమ్మం: హోంగార్డ్ నరేశ్ మృతి.. కారణం ఏంటి?

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని డిగ్రీ కాలేజ్ సమీపంలోని మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద సాగర్ కాలువలో హోంగార్డ్ నరేశ్(36) <<15520402>>మృతదేహం కలకలం<<>> సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం కాలువలో నరేశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఆయన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయారా..? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 27, 2026

ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

image

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 27, 2026

BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

image

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

News February 27, 2026

సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

image

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.