News March 31, 2024
ఖమ్మం: 15వ తేదీ వరకే బియ్యం పంపిణీ!
ఖమ్మం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 4,11,283కార్డులకు గాను లబ్ధిదారులకు అవసరమైన 7,280.271మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్షాపులకు చేరవేశామని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో బియ్యం తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News September 30, 2024
క్వింటా పత్తికి రూ.500 మద్దతు ధర పెంపు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. HYDలో RR, KMM,VKB, MDCL సహా ఇతర జిల్లాలకు చెందిన అధికారులతో CCI సమావేశంలో పలు సూచనలు చేశారు. వారానికి 6 రోజులు కేంద్రాలు పని చేయనున్నాయని పేర్కొన్నారు. ఈసారి మద్దతు ధర రూ.500 పెరిగినందున కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
News September 30, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధర ఎంతంటే
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవులు అనంతరం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆదివారం క్వింటా ఏసీ మిర్చి ధర 20వేల రూపాయలు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయ విక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.
News September 30, 2024
ఖమ్మం: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
ఖమ్మం 2938 321 1: 09
భద్రాద్రి 2414 260 1:10