News December 2, 2025
ఖమ్మం: 20 ఏళ్ల కింద తోడికోడళ్లు.. ఇప్పుడు అన్నదమ్ములు

పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పోరు నెలకొంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు. 2 దశాబ్దాల కిందట తోడికోడళ్లు పోటీ పడగా, రాంబాబు, ఆయన భార్య సునీత గతంలో 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబం కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.
Similar News
News April 14, 2026
పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>
News April 14, 2026
మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.
News April 14, 2026
3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.


