News July 23, 2024

ఖమ్మం: 25 ఎకరాల భూమి కేటాయింపు: డిప్యూటీ సీఎం

image

ఖమ్మం జిల్లాలో ప్రతి 10 గ్రామాలకు ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తయారు చేస్తామని చెప్పారు. దివ్యాంగుల రిజర్వేషన్‌పై చేసిన స్మిత సబర్వాల్ ట్వీట్ ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఆమె ట్వీట్‌కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Similar News

News October 9, 2024

రేపు దద్దరిల్లనున్న ఖమ్మం

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్తాబైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 9, 2024

బతుకమ్మ పూల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి

image

అశ్వాపురం మండలం జగ్గారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నున్న ఐలయ్య బతుకమ్మ పండుగ పూల కోసంకోసం గ్రామ పరిధిలో ఉన్న ఊర చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నున్న ఐలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐలయ్య మణుగూరు సురక్ష బస్టాండ్‌లో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

News October 9, 2024

దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.