News February 15, 2025
ఖమ్మం: DCCB, PACS పదవీకాలం పొడిగింపు

సహకార సంఘాల కాలపరిమితి, 9 డీసీసీబీ ఛైర్మన్ ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి వీరి గడువు ముగుస్తున్నా ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సహకార సంఘాల పాలకవర్గ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News December 1, 2025
NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్సైట్లోని కెరీర్స్ ట్యాబ్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 1, 2025
GNT: ‘HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి’

గుంటూరు జిల్లాలో ప్రజలకు ఉచిత HIV పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సిలింగ్, పరీక్షా కేంద్రాలు (Standalone ICTCs), ప్రభుత్వ ఆసుపత్రులలో, 27 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో , 47 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో HIVతో జీవిస్తున్న వారికి NTR పెన్షన్ కింద రూ. 4,000 చొప్పున 2,634 మందికి అందిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి.
News December 1, 2025
కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.


