News March 11, 2025

ఖమ్మం: TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు దరఖాస్తులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్, జూలూరుపాడు, సుజాతనగర్, దమ్మపేట, టేకులపల్లి, కూసుమంచి, కారేపల్లి మండల కేంద్రాలలో TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్గో ATM రామారావు తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలను నడిపేందుకు కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ మిషన్ కలిగి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.

Similar News

News November 28, 2025

నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

image

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.

News November 28, 2025

నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

image

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.

News November 27, 2025

ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.