News January 7, 2025
ఖానాపూర్లో చైనా మాంజా కలకలం

ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్లో సంచలనం రేపింది.
Similar News
News December 19, 2025
22న విపత్తు నిర్వహణపై ‘మాక్ ఎక్సర్సైజ్’

జిల్లాలో విపత్తుల నిర్వహణకు యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈనెల 22న నిర్వహించనున్న విపత్తు నిర్వహణ ‘మాక్ ఎక్సర్సైజ్’ను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకృతి వైపరీత్యాల నివారణ చర్యలపై సీఎస్ శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని అన్నారు.
News December 19, 2025
ADB: ఐటీఐ ముడిసరకు కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం

ఆదిలాబాద్, ఉట్నూరు ప్రభుత్వ ఐటీఐ సంస్థలకు అవసరమైన వివిధ వృత్తుల ముడిసరకు సరఫరాకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. జీఎస్టీ గుర్తింపు పొందిన సరఫరాదారులు 5 రోజుల్లోగా ప్రిన్సిపల్ కార్యాలయంలోని బాక్సులో కొటేషన్లు అందజేయాలన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం 9866435005 నంబరును సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన సరకు సరఫరా చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.


