News March 20, 2025

ఖానాపూర్: గుడుంబా విక్రయం.. 2ఏళ్ల జైలు శిక్ష: SI

image

ఖానాపూర్‌ మండలంలోని పాత ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన మాసం రాజేశ్వర్‌ గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహశీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశామని ఎక్సైజ్‌ ఎస్సై అభిషేకర్‌ తెలిపారు. బైండోవర్‌ ఉల్లఘించి మళ్లీ మద్యం అమ్ముతూ దొరకారన్నారు. దీంతో బైండోవర్ నిబంధనల ప్రకారం నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

Similar News

News December 9, 2025

మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్: గల్లా జయదేవ్

image

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.

News December 9, 2025

మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

News December 9, 2025

గద్వాల: రూ.50 వేలకు మించితే పత్రాలు తప్పనిసరి: ఎస్పీ

image

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.50 వేలకు మించి నగదు తరలించేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 11న ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (BNSS) యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.