News March 20, 2025
ఖానాపూర్: గుడుంబా విక్రయం.. 2ఏళ్ల జైలు శిక్ష: SI

ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మాసం రాజేశ్వర్ గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. బైండోవర్ ఉల్లఘించి మళ్లీ మద్యం అమ్ముతూ దొరకారన్నారు. దీంతో బైండోవర్ నిబంధనల ప్రకారం నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్: తుది దశకు పల్లె పోరు.. బరిలో 1580 మంది

పల్లె సమరం తుది దశకు చేరుకుంది. 1580 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో 111 GPలకు 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. SRCL జిల్లాలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379 మంది, జగిత్యాల జిల్లాలో 119 GPలలో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456 మంది బరిలో నిలిచారు. PDPL జిల్లాలో 91 GPలలో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294 మంది రేసులో ఉన్నారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News December 17, 2025
ఆసిఫాబాద్లో విభిన్న దృశ్యాలు.. ఓడినా హామీ నిలబెట్టిన

ఆసిఫాబాద్ జిల్లాలో రెండు విభిన్న ఎన్నికల ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. కౌటాల మండలం కనికిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి, ఇచ్చిన హామీ మేరకు ఆలయం వద్ద బోరు వేయించి నైతికతను చాటుకున్నారు. అయితే, చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓడిన అభ్యర్థి, ఓటు వేయలేదంటూ ఇంటింటికీ తిరిగి ఖర్చు చేసిన డబ్బులు అడగడం విమర్శలకు దారి తీసింది.


