News March 7, 2025

ఖానాపూర్: పంచాయతీ కార్యదర్శి మృతి

image

అనారోగ్యానికి గురై ఓ పంచాయతీ కార్యదర్శి గురువారం మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News September 15, 2025

విశాఖ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 329 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 92, జీవీఎంసీకి చెందిన‌వి 88, పోలీసు శాఖ‌కు సంబంధించి 25, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.

News September 15, 2025

బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీలో జహీరాబాద్ ఎంపీ కుమార్తె

image

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మీడియా, పబ్లిసిటీ ఛైర్మన్ పవన్ ఖేరా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించారు. బెంగాల్ ఎన్నికల కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కుమార్తె గిరిజా షెట్కార్(పరిశోధన)ను పశ్చిమ బెంగాల్ మీడియా కోఆర్డినేటర్ కేటాయించారు.

News September 15, 2025

అక్టోబర్ 4న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం: కలెక్టర్

image

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 4న ఉదయం 10:30కు జరుగుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. MHBD పట్టణం కొత్త బజార్‌లోని లయన్స్ భవన్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం హాజరై ఎజెండాలోని పలు అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.