News March 7, 2025

ఖానాపూర్: పంచాయతీ కార్యదర్శి మృతి

image

అనారోగ్యానికి గురై ఓ పంచాయతీ కార్యదర్శి గురువారం మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News April 18, 2026

విధుల పట్ల అంకితభావంతో ఉండాలి: ADB SP

image

పోలీసు సిబ్బంది అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం సెట్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సిబ్బందికి మార్గదర్శనం చేశారు. యూనిఫామ్‌ తప్పనిసరిగా ధరించాలని, ఎండాకాలం దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కృషిని అభినందిస్తూ.. రికార్డుల నవీకరణ, బాధితులతో మర్యాదపూర్వక ప్రవర్తన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

News April 18, 2026

ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2026

ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.