News March 22, 2025
ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.
Similar News
News December 8, 2025
ఆత్మకూరు: బైకు అదుపు తప్పి యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. ఆత్మకూరుకు చెందిన నవీన్ (36) బంధువుల వద్దకు అమరచింత బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో బైక్ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి మరణాన్ని నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
News December 8, 2025
NGKL: జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గడచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో 12.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లిలో 12.2, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 13.1, తెలకపల్లి 13.2, బిజినపల్లి, అచ్చంపేట మండలంలో 13.4, తాడూరు మండలం యంగంపల్లి 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News December 8, 2025
కరీంనగర్: సర్పంచ్ పీఠం కోసం అభ్యర్థుల తంటాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సర్పంచి స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


