News October 17, 2024
ఖిలా వరంగల్ సందర్శించిన ఫొటోను ట్వీట్ చేసిన సజ్జనార్

తెలంగాణ రాష్ట్ర రోడ్ & ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి వీసీ సజ్జనార్ గతంలో వరంగల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. 16 ఏళ్ల క్రితం వరంగల్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సజ్జనార్ తన సతీమణితో కలిసి ఖిలా వరంగల్ కోటను సందర్షించారు. కోటలో తన సతీమణితో దిగిన ఫొటోను ఈరోజు ‘X’లో పోస్ట్ చేసి ఆ మధుర స్మృతిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎంతటి బిజీ లైఫ్ ఉన్నా.. ఫ్యామిలీతో గడిపిన క్షణాలు మధురమైనవన్నారు.
Similar News
News November 4, 2025
ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.
News November 4, 2025
నేషనల్ హైవే భూసేకరణపై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (ఎన్హెచ్ 163జీ) పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్షించారు. మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాల మీదుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 176.52 హెక్టార్లకు గాను 171.34 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పెండింగ్ అవార్డులను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 4, 2025
వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,200 ధర పలకగా.. ఈరోజు రూ.17,800 అయింది. అలాగే, వండర్ హాట్ (WH) మిర్చికి రూ.15,500 ధర వస్తే.. నేడు రూ.16,200 అయింది. మరోవైపు, తేజ మిర్చి ధర నిన్న రూ.14,000 ధర ఉంటే.. మంగళవారం 15,100 అయింది.


