News August 28, 2024
ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
Similar News
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
News November 26, 2025
శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.
News November 26, 2025
HYD: లోకల్ బాడీల్లో BRS ‘డబుల్ స్ట్రాటజీ’

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి తర్వాత, GP ఎలక్షన్స్లో గెలవడానికి BRS ప్రయత్నాలు మొదలెట్టింది. కాంగ్రెస్ పాలనలో GPలకు నిధుల కొరత, 42% BC కోటా అమలులో వైఫల్యాలని చెబుతూ ప్రచారంలో మెయిన్ ఎజెండాగా ప్లాన్ చేసింది. 2వ ఎజెండా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడం. KTR ఇప్పటికే ‘HILT’ పాలసీలో లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని లేవనెత్తారు. వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.


