News September 4, 2024
ఖైరతాబాద్: వరద నష్టాలపై వారాంతంలోగా వివరాలివ్వాలి

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలి. ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.
Similar News
News September 16, 2025
నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్

నేడు హైదరాబాద్కు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
News September 15, 2025
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.