News March 22, 2025

ఖైరతాబాద్: స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఇలాంబర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీంట్లో భాగంగా ఇటీవల బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,101.21 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగరంలో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు.

Similar News

News December 2, 2025

HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

image

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌‌‌‌‌‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్‌ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా

News December 2, 2025

హైదరాబాద్‌లో తొలి IFAS టెక్నాలజీ!

image

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్‌డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్‌లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్‌లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.

News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.