News February 6, 2025

గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

image

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News December 22, 2025

నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

image

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.

News December 22, 2025

డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (ఫొటోలో)
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక పౌరుడిని హతమార్చారు
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం

News December 22, 2025

ATP: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి

image

గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సాయిరాజ్ (22) జంగాలపల్లి-ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుడు అనంతపురం జేఎన్టీయూ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.