News February 6, 2025

గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

image

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News September 17, 2025

HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

image

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.

News September 17, 2025

ఖమ్మం: మారణకాండ.. ఒకే చితిపై ఏడుగురి సజీవ దహనం

image

బోనకల్(M) గోవిందాపురం(L)లో రజాకారులు, భూస్వాములు రైతాంగ సాయుధ పోరాట యోధులపై మారణకాండ సృష్టించారు. ఆళ్లపాడు, వల్లాపురం, CKN(M) రేపల్లెవాడకు చెందిన యలమందల రామచంద్రయ్య, మంద అచ్చయ్య, గొర్రె ముచ్చు అజరయ్య, మద్ది రాములు, మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, తమ్మినేని బుచ్చయ్యలను చిత్రహింసల అనంతరం ఒకే చితిపై సజీవ దహనం చేశారు. వారిని స్మరించుకుంటూ ఏటా ఫిబ్రవరి 10న స్థూపం వద్ద సంస్మరణ సభలు జరుగుతున్నాయి.

News September 17, 2025

పరేడ్‌లో విమోచన దినోత్సవం.. భారీ బందోబస్తు

image

పరేడ్ మైదానంలో నేడు జరగబోయే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర బలగాలు, సాంస్కృతిక బృందాలు, తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో ఇప్పటికే రిహార్సల్స్ నిర్వహించాయి. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.