News February 6, 2025

గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

image

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News December 15, 2025

MHBD: ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచాడు!

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రాజమాన్ సింగ్ తండా సర్పంచ్ అభ్యర్థి గుగులోతు పటేల్ విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తన సమీప ప్రత్యర్థి జాటోత్ కుమార్‌పై ఒక్క ఓటు తేడాతో పటేల్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.

News December 15, 2025

నేటితో ముగియనున్న భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవం ఇవాళ్టితో ముగియనుంది. మరికాసేపట్లో యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రికి దీక్షాధారులు భారీగా చేరుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1.5 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఇరుముడిని సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

News December 15, 2025

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.