News February 6, 2025
గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News October 27, 2025
పెద్దపల్లి: 5 రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం..!

ఇన్స్టాగ్రాంలో పరిచయమయ్యారు. ఈ నెలాఖరుతో యువతికి మైనరిటీ తీరనుంది. NOV 1న ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకోసం నెలముందే ప్రియుడి ఇంటికొచ్చిఉంది. ఈ క్రమంలో పెళ్లికిముందు నదీస్నానం ఆచరించాలని ప్రేమజంట గోదావరిలోకి దిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. జాలర్లు గోదావరిఖనికి చెందిన రవితేజ(22)ను ప్రాణాలతో కాపాడగా.. PDPL(M)వాసి మౌనిక(17)ను ఒడ్డుకు చేర్చేసరికి మరణించింది.
News October 27, 2025
పల్నాడు: ‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి’

తుపాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. తుపాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.
News October 27, 2025
HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.


