News February 6, 2025

గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

image

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News December 15, 2025

సామాన్యుల సమస్యల పట్ల అలసత్వం వద్దు: SP

image

పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గరగపర్రులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టంలో ఆయన 11 అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

News December 15, 2025

తిరిగి వస్తాం.. మీ ప్రేమకు ధన్యవాదాలు: మెస్సీ

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ మూడు రోజుల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించగా.. భారతీయ అభిమానుల నుంచి వచ్చిన ప్రేమకు ముగ్ధులయ్యారు. ‘మేము మీ ప్రేమనంతా మాతో తీసుకెళ్తున్నాం. కచ్చితంగా తిరిగివస్తాం. మ్యాచ్ ఆడటానికి లేదా మరే సందర్భంలోనైనా ఇండియాను సందర్శిస్తాం’ అంటూ అభిమానులకు మెస్సీ ధన్యావాదాలు తెలిపారు.

News December 15, 2025

MLA సురేంద్రబాబుకు హైకోర్ట్ నోటీసుల జారీ

image

కళ్యాణదుర్గంలో గతంలో జరిగిన ఈ-స్టాంపుల కుంభకోణం మరోసారి వెలుగులోకొచ్చింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర హైకోర్టు కళ్యాణదుర్గం MLA సురేంద్రబాబుతో పాటు 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలోపు వివరణ ఇవ్వాలని కోర్టు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. రూ.100 స్టాంపును రూ.లక్షగా మార్చి వాటి ద్వారా బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. అవి ఈ నోటీసులతో మరోసారి వెలుగులోకొచ్చాయి.