News February 6, 2025
గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News December 12, 2025
MHBD: ఈనెల 13న జవహార్ నవోదయ పరీక్ష!

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు మామునూర్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ బి.పూర్ణిమ శుక్రవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 సెంటర్లలో 5648 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం 11:30 నుంచి మ.1:30 వరకు పరీక్ష జరుగుతుందని,
అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. https://navodaya.gov.in
News December 12, 2025
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఉప్పలగుప్తం విద్యార్థుల ఎంపిక

ఉప్పలగుప్తం రాష్ట్ర స్థాయి అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీలకు మండలం గొల్లవిల్లి ZP ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పోటీలకు ఎంపికైన మల్లిపూడి అయ్యప్ప, సవరపు లక్ష్మిలను శుక్రవారం ఆ పాఠశాలలో HM కనకదుర్గ, పీడీలు గొలకోటి ఫణీంద్ర కుమార్, దూలం సరస్వతి, టి.సునీత, వి.విజయభాస్కర్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం పట్ల స్కూల్కు మంచిపేరు తీసుకొచ్చారన్నారు.
News December 12, 2025
ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


