News March 21, 2025

గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

image

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News November 29, 2025

JN: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జనగామ జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ బాక్స్లు, రవాణా, భద్రత సహా అన్ని అంశాల్లో పటిష్ఠ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.

News November 29, 2025

కాళోజీ వర్సిటీ ఇష్యూ.. చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం: రేవంత్

image

TG: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలతో పాటు ఇన్‌ఛార్జుల నియామకంలో ఆరోపణలపై ఆయన ఆరా తీశారు. ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆరోపణలతో కాళోజీ వర్సిటీ వీసీ డా.నందకుమార్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.

News November 29, 2025

MHBD: సర్పంచ్‌గా మొదలై.. 6 సార్లు MLA

image

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన మాజీ మంత్రి DS రెడ్యానాయక్ రాజకీయ దురందరుడు. ఆయన రాజకీయ జీవితం మొదటగా 1981లో సొంత గ్రామం ఉగ్గంపల్లి సర్పంచ్‌గా మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఏకంగా 6 సార్లు MLAగా, మంత్రిగా, 2018లో పార్టీ మారి BRS ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.