News March 21, 2025

గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

image

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News November 23, 2025

సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News November 23, 2025

హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

image

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2025

ఏలూరు కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

image

ఏలూరులోని గౌతమీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు హాజరై.. బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారని, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.