News January 29, 2025
గంజాయి కేసులో కోట్ల విలువైన ఆస్తులు సీజ్: SP

శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల గంజాయిని తరలిస్తుండగా బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడన్నారు. గంజాయి వ్యాపారంలో సంపాదించిన రూ.1.97 కోట్ల ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటికే నోటీసులు కూడా అందజేశామన్నారు.
Similar News
News February 18, 2025
VZM: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత కె.విజయగౌరి మొదటిసారి బరిలో ఉండగా పీ.ఆర్.టీ.యూ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన గాదె శ్రీనివాసులునాయుడు మూడోసారి, ఏపీటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ MLC పాకలపాటి రఘువర్మ రెండోసారి బరిలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఉపాధ్యాయులు పట్టం కడతారోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 18, 2025
ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

శృంగవరపుకోట టౌన్ పరిధిలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో 17ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. బద్దు మహేందర్ రెడ్డి తన బండిపై విశాఖ-అరకు హైవే దాటుతుండగా, బాడితబోయిన దుర్గాప్రసాద్(17) బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలతో బాలుడు మృతి చెందగా.. మహేంద్ర రెడ్డి విజయనగరంలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
News February 18, 2025
విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937
➤ పురుష ఓటర్లు: 3,100
➤ మహిళా ఓటర్లు:1,837
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29
➤ పోలింగ్ తేదీ: 27.02.2025
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025